ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్ లో నేరస్తులను వెతకడానికి వెళ్ళిన పోలీసులపై దాడులు చేయగా...  8 మంది పోలీసులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. రౌడీ షీటర్ వికాస్ దుబేను వెతుక్కుంటూ బికారు గ్రామంపై దాడి చేసారు పోలీసులు. ఈ సమయంలో నేరస్తులు అందరూ పోలీసు సిబ్బంది పై కాల్పులు జరిపారు. 

 

ఈ కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించారు అని అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళగా మెరుపు దాడి చేసారు అని  అప్పుడే ఈ విధంగా ఘటన జరిగింది అని అంటున్నారు. అయితే పోలీసుల చేతుల్లో ఆయుధాలు లేవు అని తెలుస్తుంది. “మేము కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాము. ఎనిమిది మంది పోలీసు సిబ్బంది మరణించారు, నలుగురు గాయపడ్డారు, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే రౌడీ మూకలు, జేసీబీ అడ్డం పెట్టి, ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరిపారు అని డీజీపీ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: