తెలంగాణా సిఎం కేసీఆర్ ముందు నుంచి భయపడుతున్న విధంగానే ప్రగతి భవన్ లో కరోనా అడుగు పెట్టింది. తెలంగాణా అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్ లో 20 మందికి కరోనా వచ్చింది. ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్... ఫాం హౌస్ కి వెళ్ళిపోయారు. దాదాపు వారం రోజుల్లోనే 20 మందికి కరోనా వచ్చింది. 

 

ప్రగతి భవన్ మొత్తాన్ని కూడా.. ఇప్పుడు అధికారులు శానిటేషన్ చేస్తున్నారు. వైద్య అధికారుల పర్యవేక్షణలో ప్రగతి భవన్ ఉంది. అక్కడ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా పలువురు భద్రతా సిబ్బందికి కూడా కరోన సోకింది. దీనితో  ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణాలో అధికార పార్టీ నేతలకు కరోనా వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: