కరోనా నుంచి తెలంగాణా హోం శాఖా మంత్రి మొహమ్మద్ అలీ కోలుకుని బయటపడ్డారు. ఆయనకు వారం క్రితం కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు ఇప్పుడు ఆయన కరోనా నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు అని అధికారులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుత౦ నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా ఆయన కొన్ని రోజులు పాటు హోం క్వారంటైన్ లో ఉండటం మంచిది అని అధికారులు సూచించారు. దీనితో ఆయనతో అధికారులు ఇక నుంచి నేరుగా ఇంటి నుంచే చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనతో పాటుగా ఆయన కుటుంబం కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది అని అధికారులు వెల్లడించారు. కాగా తెలంగాణాలో మరో ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలకు కరోనా సోకిన్ సంగతి తెలిసిందే.