కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో భారతదేశం పురోగతి సాధిస్తుందని రోజురోజుకు రికవరీ పెరుగుతుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మొన్నటి వరకు 50 శాతానికి పైగా ఉన్న రికవరీ రేటు ఈరోజు 60 శాతానికి దాటినట్లు ప్రకటించింది.
ఈరోజు 60.73 శాతం రికవరీ పెరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చి 101 రోజులవుతుంది అంటూ తెలిపింది కేంద్రం. ప్రజలందరూ ఇదే స్ఫూర్తితో కరోనా వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే భారతదేశం పూర్తిగా కరోనా వైరస్ బారి నుంచి బయట పడుతుంది అంటూ తెలిపింది కేంద్ర ప్రభుత్వం,