టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఏసీబీ కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు ని ఆయనకు బెయిల్ ఇవ్వాలి అని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. అదే విధంగా ఆయన విచారణకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు హాజరు అవుతారని తెలిపారు.
అయితే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దు అని ఏసీబీ అధికారులు వాదించారు. వారి వాదనలను విన్న ఏసీబీ కోర్ట్ ఆయన బెయిల్ పిటీషన్ ని కొట్టేసింది. ఇక ఆయన ఇప్పుడు విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. ఆయనను మరో పది రోజులు కష్టడీ కి కోరే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.