గాంధీ ఆస్పత్రిలో అందించే వైద్య సేవలపై ఇప్పుడు అనేక విమర్శలు వస్తున్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు అని పలువురు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇక అక్కడ నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రికి చెందిన ఒక వైరల్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

 

అది ఏంటీ అంటే... గాంధీ ఆస్పత్రి మార్చురీ కి వెళ్ళే దారిలో గుర్తు తెలియని శవాలు పడి ఉన్నాయి. దీనికి సంబంధించి వైద్యులను అడగగా తమకు తెలియదు అని చెప్పారు. అక్కడి సిబ్బంది కూడా ఈ విషయం తమకు తెలియదు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించి  ప్రభుత్వం ఆరా తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: