అనంతపురం జిల్లాలో కరోన కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి జిల్లాలో కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. ధర్మవరం సహా కొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. తాజాగా హిందూపురం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో కరోనా కలకలం సంచలనంగా మారింది. 

 

ఆ బ్యాంకు లో డిప్యూటీ మేనేజర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. కరోనా నేపధ్యంలో నేడు బ్యాంకును మూసి వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇక బ్యాంకు కి వెళ్ళిన ఖాతాదారుల్లో భయ౦ నెలకొంది. ఆ బ్యాంకు లో పనిచేసే 40 మంది ఉద్యోగులకు నేడు కరోనా పరిక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: