బందరు వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు అన్నారు. కాసేపటి క్రితం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.  భాస్కర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు అని ఆయన వివరించారు. తన పేరు బయటకు రాకుండా చూడాలి అని కొల్లు చెప్పారు అని రవీంద్ర బాబు చెప్పుకొచ్చారు. 

 

నిందితుల వాంగ్మూలం తీసుకున్నామని ఆయన అన్నారు. మోకా హత్యకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. మోకా హత్య కేసులో ప్రధాన నిందితుడు నాంచారయ్య, మొకాకు మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణం అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: