ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల క్రితం సంచలనం సృష్టించిన బందరు వైసీపీ నేత హత్య కేసులో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న మాజీ మంత్రి  కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో తన మార్క్ పంచ్ వేసారు. 

 

మర్డర్ కేసులో ఒక టీడీపీ నాయకుడు అరెస్టైతే బీసీలపై దాడంటూ అర్థ రాత్రి ఫోన్లు చేసి రచ్చ చేస్తున్నాడు నాయుడు బాబు అంటూ ఆయన ఎద్దేవా చేసారు. హత్యకు గురైన భాస్కర రావు బీసీ కాదా? అని ప్రశ్నించారు. బాధితునికి న్యాయం చేయాలంటూ వేలాది మంది బీసీ మహిళల ధర్నాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రతిదానికి కులం కార్డు ఏంటి బాబు అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: