భారత్లో టిక్టాక్ సహా 59చైనా యాప్లను నిషేధించిన తర్వాత.. వాటి ప్రత్యామ్నాయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా టిక్టాక్కు భారత్లో ఉన్న మార్కెట్ అంతా ఇంతా కాదు. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు దేశీయంగా పలు యాప్లు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ రేసులోకి సామాజిక మాధ్యమ దిగ్గజం ఇన్స్టాగ్రామ్ కూడా ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టిక్టాక్ను పోలి ఉన్న ఫీచర్లను రీల్స్ పేరుతో గత ఏడాది నవంబర్లో ఆవిష్కరించింది ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్పై ఫ్రాన్స్, జర్మనీల్లో ట్రయల్స్ నిర్వహించినట్లు ఇన్స్టాగ్రామ్ గతవారం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు త్వరలోనే భారత్లో ఈ ఫీచర్ను ఇన్స్టాగ్రామ్ పరీక్షించనున్నట్లు సమాచారం.
భారత్లో ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లకు ఇన్స్టా దీనిని అందించిందని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అందుకే ఈ టెక్నాలజీ అందుకోవాల్సిన దేశాల జాబితాలో భారత్ లేదని తెలిపింది. రీల్స్లో కూడా 15క్షణాల పాటు వీడియోను చేసే అవకాశం ఉంది. దీనికి అవసరమైన ఆడియోను ఎడిట్ చేసుకోవచ్చు.కొత్త ఫీచర్ జోడిస్తే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు పెరుగుతారని భావిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్బుక్ తెలిపింది. అయితే కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది.