ఈ సంవత్సరం అమర్​నాథ్​ యాత్ర ఆంక్షల నడుమ జరుగనుంది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా రోజుకు 500మందిని మాత్రమే మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనునట్లు జమ్ముకశ్మీర్ పాలన యంత్రాంగం తెలిపింది.

 


అమర్​నాథ్​ యాత్ర జూన్​ 23న ప్రారంభమై 42 రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తితో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే యాత్ర జులై చివరి వారంలో ప్రారంభమై 15 రోజులే జరుగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు అధికారులు వెల్లడించారు.యాత్ర నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉప కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో భద్రత సహా తీర్థయాత్ర ఏర్పాట్లను సమీక్షించినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: