కరోనా నేపథ్యంలో హెలికాప్టర్​లో వెళ్లి వివాదంలో చిక్కుకున్నారు హీరో అక్షయ్ కుమార్. ఈ విషయమై మహారాష్ట్ర మంత్రి విచారణకు ఆదేశించారు.

 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నాసరే ఇటీవలే ముంబయి నుంచి నాసిక్​కు హెలికాప్టర్​లో​ వెళ్లడమే ఇందుకు కారణం. అయితే అక్షయ్​కు ప్రత్యేక అనుమతి ఎవరిచ్చారనే దానిపై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర మంత్రి చగన్ భుజ్​బల్ పేర్కొన్నారు.

 

అయితే ఓ వైద్యుడిని కలిసేందుకే అక్షయ్ నాసిక్​కు వచ్చారని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: