కరోనా నేపథ్యంలో హెలికాప్టర్లో వెళ్లి వివాదంలో చిక్కుకున్నారు హీరో అక్షయ్ కుమార్. ఈ విషయమై మహారాష్ట్ర మంత్రి విచారణకు ఆదేశించారు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నాసరే ఇటీవలే ముంబయి నుంచి నాసిక్కు హెలికాప్టర్లో వెళ్లడమే ఇందుకు కారణం. అయితే అక్షయ్కు ప్రత్యేక అనుమతి ఎవరిచ్చారనే దానిపై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర మంత్రి చగన్ భుజ్బల్ పేర్కొన్నారు.
అయితే ఓ వైద్యుడిని కలిసేందుకే అక్షయ్ నాసిక్కు వచ్చారని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.