ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలి అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సిఎం వైఎస్ జగన్ కు లేఖ రాసారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారని ఆయన గుర్తు చేసారు. 

 

2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారన్న ఆయన.. దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ఆయన సిఎం జగన్ ను లేఖలో విజ్ఞప్తి చేసారు. చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: