దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇవాళ రికార్డు స్థాయిలో 6,555 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్​ వేగంగా విస్తరిస్తోంది.

 

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 6,555 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ నుంచి నేడు 3,658 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,06,619కి చేరింది. మరణాలు 8,822కు చేరగా.. ఇప్పటివరకు 1,11,740 మంది వైరస్​ బారి నుంచి బయటపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: