ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పరిక్షలపై ఇప్పుడు కేంద్రం కూడా ఆరా తీస్తుంది. ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏపీలో కరోనా పరీక్షలను భారీగా చేసింది రాష్ట్ర ప్రభుత్వ౦. దేశం వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ఇక పరిక్షల విషయంలో ఏపీ సర్కార్ దూకుడుగా ఉన్న నేపధ్యంలో  వైరస్ వ్యాప్తిని కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా కట్టడి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 

 

ఇక ఏపీలో కరోనా కేసుల పెరుగుదల కూడా చాలా తక్కువగానే ఉంది. తెలంగాణాలో చేసిన పరీక్షల్లో 20 శాతం వరకు కరోనా  పెరుగుదల రేటు ఉంటే... ఏపీలో అది చాలా తక్కువగా ఉంది.  ఇప్పుడు ప్రతీ రోజు 50 వేల పరిక్షల వరకు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: