ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోరనా భయం ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. కరోనా వస్తే చనిపోతాం లేదా మా వాళ్లకు కూడా సోకుతుంది అనే ఆందోళన చాలా మందిలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సగం మంది ఆ భయంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు.  అన్ని విధాలుగా వైద్య సదుపాయాలు అందిస్తున్నా సరే కరోనా వచ్చింది అనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

 

ఢిల్లీ హైదరాబాద్ సహా బెంగళూరు ప్రాంతాల్లో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఢిల్లీ లోని ఎయిమ్స్ ట్రామా సెంటర్ వద్ద ఒక వ్యక్తి కరోనా వచ్చింది అనే భయంతో ఎయిమ్స్ నాలుగో అంతస్తు నుంచి దూకాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అతన్ని ఆస్పత్రిలో జాయిన్ చేసామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: