హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్​ కల్పిస్తూ ముసాయిదా ఆర్డినెన్స్​కు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర కేబినెట్​ భేటీలో ఆర్డినెన్స్​ను ప్రవేశపెట్టారు ఉపముఖ్యమంత్రి దుష్యంత్​ చౌతాలా. అనంతరం ఆర్డినెన్స్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ట్వీట్​ చేశారు.

రాష్ట్ర యువతకు ఇది ఒక చారిత్రక రోజు. హరియాణాలోని ప్రైవేటు సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే ఇచ్చేలా చేసే ముసాయిదా ఆర్డినెన్స్​కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం స్థానిక యువతకు మేలు చేకూర్చనుంది అని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: