గత నెల 29న జరిగిన నకిలీ శ్రీలంక టీ20 లీగ్లో తాజాగా రవీందర్ దండివాల్ అనే మరో వ్యక్తి అరెస్టు అయ్యాడు. పంజాబ్లోని మొహలీ జిల్లాలో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఏసీయూ బృందం చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.గతంలోనూ అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్లోనూ నిందితుడుగా ఉన్నాడు రవీందర్.
లాక్డౌన్ వేళ.. దేశవ్యాప్తంగా ఎక్కడా క్రికెట్ మ్యాచ్లు జరగట్లేదు. క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా చేయట్లేదు. అలాంటి సమయంలో పంజాబ్లోని చండీగఢ్ సమీపంలోని ఓ పల్లెటూరిలో జూన్29న ఉవా క్రికెట్ లీగ్ పేరుతో(శ్రీలంక టీ20 లీగ్ ) ఓ మ్యాచ్ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో లైవ్ స్కోర్ కూడా వచ్చింది. అయితే ఈ మ్యాచ్తో తమకేమీ సంబంధం లేదని ఇటు భారత్, అటు శ్రీలంక క్రికెట్ బోర్డులు స్పష్టం చేశాయి.దీంతో పంజాబ్ పోలీసులూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికీ పంకజ్ జైన్, రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. తాజాగా రవీందర్ దండివాలా అనే మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.