రామగుండంలోని సింగరేణి మేడిపల్లి ఓసీపీలో బొగ్గు తవ్వుతుండగా ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పురావస్తుశాఖ సిబ్బంది వాటిని పరిశీలిస్తున్నారు. అవి ఇక్కడికి ఎలా వచ్చాయనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

 

 

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి గనుల్లో ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. సింగరేణి మేడిపల్లి ఓసీపీలో బొగ్గు తవ్వుతుండగా.. ఏనుగు దంతాలను కార్మికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న పురావస్తుశాఖ సిబ్బంది వాటిని పరిశీలిస్తున్నారు. గతంలో ఇక్కడ ఏనుగులు సంచరించేవా..? అవి మృతిచెందాక భూమిలో కలిసిపోయిన దంతాలా.. లేదా ఎవరైనా తెచ్చి ఇక్కడ భద్రపర్చారా అనే విషయం అధికారులు తేల్చాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: