పాకిస్థాన్​పై ప్రయాణాల ఆంక్షల ఎత్తివేసే దిశగా డబ్ల్యూహెచ్​ఓ కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అభ్యర్థించారు. ప్రయాణాలపై ఆంక్షలతో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.కరోనా నేపథ్యంలో పాకిస్థాన్​పై ప్రయాణ పరిమితులను తొలగించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ కోరారు. డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్​తో వీడియో కాల్​లో మాట్లాడిన ఇమ్రాన్​.. ఈ మేరకు అభ్యర్థించారు.

 

 

అంతర్జాతీయంగా కరోనా వైరస్ సంబంధిత ప్రయాణ నిషేధాలపై మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నట్లు అధనోమ్​ ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా వైరస్​పై పోరులో పాక్ ప్రభుత్వ కృషిని ప్రశంసించారు.పాకిస్థాన్​లో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 2.31 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 4,762 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జఫర్ మీర్జాకు కరోనా పాజిటివ్​గా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: