పాకిస్థాన్పై ప్రయాణాల ఆంక్షల ఎత్తివేసే దిశగా డబ్ల్యూహెచ్ఓ కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించారు. ప్రయాణాలపై ఆంక్షలతో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.కరోనా నేపథ్యంలో పాకిస్థాన్పై ప్రయాణ పరిమితులను తొలగించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్తో వీడియో కాల్లో మాట్లాడిన ఇమ్రాన్.. ఈ మేరకు అభ్యర్థించారు.
అంతర్జాతీయంగా కరోనా వైరస్ సంబంధిత ప్రయాణ నిషేధాలపై మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నట్లు అధనోమ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా వైరస్పై పోరులో పాక్ ప్రభుత్వ కృషిని ప్రశంసించారు.పాకిస్థాన్లో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 2.31 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 4,762 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జఫర్ మీర్జాకు కరోనా పాజిటివ్గా తేలింది.