ఒక పక్క వరుసగా కాల్పులు జరుగుతున్న సరే ఉగ్రవాదులు మాత్రం జమ్మూ కాశ్మీర్ లో అసలు ఆగడం లేదు. జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు భద్రతా బలగాల సంయుక్త ఆపరేషన్ లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులను కాల్చి చంపుతున్నా సరే ఏదోక ఘటన జరుగుతూనే ఉంది.  ఇటీవల ఒక  ఎన్కౌంటర్ జరగగా అందులో సిఆర్పీఎఫ్ కి చెందిన్ జవాన్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

 

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో తెలంగాణా రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకు చెందిన జవాన్ ఎస్.శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు అని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సదరు జవాన్ స్వస్థలం పెద్దపల్లి మండలం రామగిరి మండలం నాగేపల్లి గ్రామం అని అధికారులు పేర్కొన్నారు. అతను 2013లో ఆర్మీలో చేరగా రెండేళ్ళ క్రితమే వివాహం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: