మద్యానికి బానిస అయిన కొందరిలో మానవతా విలువలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అని చాలా మంది అంటూ ఉంటారు.  వారిలో మానవత్వం అనేది ఏ కోణంలో చూసినా సరే కనపడదు అంటూ వ్యాఖ్యలు చేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మద్యానికి బానిసైన ఒక కొడుకు కన్న తల్లిని డబ్బు కోసం చంపేసిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. 

 

పీఏపల్లి మండలం బాలాజీనగర్‌లో  నివాసం ఉండే మున్నా అనే యువకుడు తన తల్లి మేగావాత్ బుజ్జిని రోకలి బండతో కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: