పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం ఎంత సమర్ధవంతంగా ఉన్నా సరే కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు మొత్తం రెండు వేలకు చేరాయి. 

 

ఆ జిల్లాలో నిన్న ఒక్క రోజే 197 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. జిల్లా కేంద్రం ఏలూరులో 97 కరోనా కేసులు నమోదు కాగా పాలకొల్లులో 34 కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం కేసులు 2 వేల 63 గా ఉన్నాయి. ఒక్క రోజే నిన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: