ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విషయంలో ఏ మాత్రం కూడా రాజీ లేదు అని మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా స్పష్టం చేసారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాద ప్రభావిత గ్రామం అయిన ఆర్ఆర్ వెంకటాపురం లో విలేజ్ క్లీనిక్ ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రమాదకర కంపెనీలను నివాస ప్రాంతం నుంచి తరలించాలి అని సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు అని ఆయన పేర్కొన్నారు. 

 

గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు వైద్య సహాయక చర్యలను అందిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: