తెలంగాణలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1879 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1422 కేసులు వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరగా.. మరణాల సంఖ్య 313కి పెరిగింది.

 

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,341 మందికి నెగిటివ్‌గా తేలింది. ఇవాళ మరో 1506 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం 11,012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: