సురక్షితమైన కరోనా వ్యాక్సిన్ను ఈ ఏడాది చివరినాటికి అభివృద్ధి చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఎలాంటి హడావుడి లేదని పేర్కొన్నారు.
మైల్యాబ్స్ సొల్యూషన్స్ సంస్థ తయారు చేసిన 'కాంపాక్ట్ ఎక్స్ఎల్' డయాగ్నోస్టిక్ మెషిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... సమర్థమంతమైన వ్యాక్సిన్ తయారీపైనే దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా పరీక్షలు నిర్వహించడం చాలా కీలకమని పూనావాలా పేర్కొన్నారు. అందుకే మైల్యాబ్స్లో ఎస్ఐఐ పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. భారత్లో సరిపడా పరీక్షలు జరగడం లేదని అన్నారు. కేసులు పెరుగుతాయన్న భయం ఉండకూడదని సూచించారు.