జమ్ముకశ్మీర్​ పుల్వామాలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లపై ఉగ్రదాడి ఘటనలో మరో నిందితుడిని అరెస్ట్​ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుంది.

 

40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లను బలితీసుకొన్న పుల్వామా ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ). తాజాగా మరో నిందితుడిని అరెస్ట్​ చేసింది.


ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడో వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఎన్​ఐఏ అధికారులు.2019 ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్​ వాహనశ్రేణిపై జైషే మహ్మద్​ ​ ఉగ్ర దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: