తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలనే కాదు నాయకులు అధికారులు డాక్టర్లు సైతం బెంబేలెత్తిస్తోంది ఈ మహమ్మారి వైరస్. తాజాగా హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేసుకోగ ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన అసోసియేషన్ లో చికిత్స తీసుకుంటూ ఉండగా... గత కొన్ని రోజుల నుంచి ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.