దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దాదాపు అన్ని ప్రాంతాలలో అత్యధికంగానే కేసులు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలోనే బీహార్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ ఉదృతి భారీగానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ రాజధాని పాట్నాలో వారం పాటు సంపూర్ణ లాభం విధించింది బీహార్ సర్కార్, జూలై 10 నుంచి 16వ తేదీ వరకు కఠినంగా లాక్ డౌన్ నిబంధనలతో అమలులో ఉంటుందని స్పష్టం చేసింది, ఈ మేరకు పాట్నా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది.