ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీలోనే పనిచేస్తున్న రవికుమార్, బ్రహ్మారావు.. తమ సంస్థలో ఉద్యోగాలిప్పిస్తామంటూ తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాలకు చెందిన 16 మంది నుంచి 57 లక్షల రూపాయల వసూలు చేశారు. నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవటంతో బాధితులు వారిని నిలదీశారు.

 


నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు, గుర్తింపుకార్డులు ఇచ్చి కొంతకాలం వారిని మభ్యపెట్టినా చివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: