మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అతని కోసం వారం రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక తాజాగా అతన్ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ  నేపధ్యంలో పోలీసులను మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. 

 

అరెస్టు చేసినందుకు ఎంపీ పోలీసులను అభినందిస్తున్నానని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తానూ యూపీ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నానని.. యూపీ సీఎం ఆదిత్యనాథ్ తో కూడా మాట్లాడానని అన్నారు. తదుపరి దర్యాప్తు కోసం, అతన్ని యుపి పోలీసులకు అప్పగిస్తారని చెప్పారు. సమన్వయంతో రెండు రాష్ట్రాల పోలీసులు పని చేస్తున్నారని చౌహాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: