ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా సహా కొన్ని రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ పోలీసులు అతన్న అరెస్ట్ చేసే సమయంలో చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరించారు. అతను మహంకాళి దేవాలయంలో ఉన్నాడు అనగానే   దేవాలయ భద్రతా సిబ్బంది నుంచి జిల్లా ఎస్పీకి సమాచారం వెళ్ళింది. 

 

వెంటనే ఆయన సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఉజ్జయిని ఎస్పీ మనోజ్ సింగ్ 150 మంది సాయుధ పోలీసులను వెంట తీసుకొని వచ్చి గార్డు నుంచి  అతన్ని అరెస్ట్ చేసారు. అతన్ని నేడు లేదా రేపు ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని మధ్యప్రదేశ్ సిఎం చౌహాన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: