ఎవరు ఎన్ని చెప్పినా సరే కరోనా వైరస్ మానవత్వం చంపేసిన సంగతి స్పష్టంగా అర్ధమవుతుంది. కనీసం జాలీ దయా అనేవి లేకుండా చాలా వరకు జనాలు ప్రవర్తిస్తున్నారు. గతంలో ప్రేమించిన వారి వద్దకు కూడా కరోనా వైరస్ భయంతో ఇప్పుడు వెళ్ళడం లేదు జనాలు. దీనితో  చాలా మంది అనాధలు గా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. 

 

ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా తీసుకుని వెళ్ళే పరిస్థితి హైదరాబాద్ లో లేరు అనేది స్పష్టంగా వార్తల్లో చూస్తున్నాం. ఇక ఇదిలా ఉంటే తాజాగా మిర్యాల గూడలో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ పట్టణం సుందర్‌నగ‌ర్‌ లో నివాసం ఉండే ఒక యువకుడు కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.  కాని అతని మృతదేహాన్ని తీసుకోవడానికి తల్లి తండ్రులు కూడా రాకపోవడం  కన్నీరు పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: