ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి ప్రభుత్వం తీసుకుని రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలు కూడా ప్రసంశల వర్ష౦ కురిపిస్తున్నాయి. ఇక సరిహద్దు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాలు కూడా హర్షం వ్యక్తం చేసాయి.
తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. ఆరోగ్య శ్రీ ద్వారా జగన్ గారి ప్రభుత్వం కరోనాకు చికిత్స చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే ఈ మహామ్మారికి వైద్యం పూర్తిగా ఉచితం చేసిన... ఏకైక సర్కార్ జగన్ గారిది అని ఆయన కీర్తించారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునేందుకు విధి విధానాలు జారీచేసిందని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ ద్వారా జగన్ గారి ప్రభుత్వం కరోనాకు చికిత్స చేస్తోంది.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 9, 2020
దేశంలోనే ఈ మహామ్మారికి వైద్యం పూర్తిగా ఉచితం చేసిన... ఏకైక సర్కార్ జగన్ గారిది.
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునేందుకు విధి విధానాలు జారీచేసింది.