దేశవ్యాప్తంగా పలుచోట్ల ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది, ఉత్తర పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ప వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు..
ఇక పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ప్రజలు ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు. మహారాష్ట్ర సముద్రతీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడే అవకాశముందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు అంటూ హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు.