రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణకు పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయలో వాటర్ గ్రిడ్, ఎడ్యుకేషన్, నదుల అనుసంధానం స్కూల్స్ నాడు నేడు అమలు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు పాల్గొన్నారు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ తాగునీటి కల్పన పై చర్చించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరువు నివారణ కు అక్టోబర్ 1 నుంచి పనులు ప్రారంభించాలి అంటూ ఆదేశించారు.