సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో.. సుధీర్ కుమార్ ఓజా అనే అడ్వకేట్ ఏకంగా బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్ ఖాన్ ఏక్తా కపూర్ కరణ్ జోహార్ లాంటి పలువురు ప్రముఖుల పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరిపిన జ్యుడీషియల్ కోర్టు ఇది కోర్టు పరిధిలోకి రాదు అంటూ పిటిషన్ను కొట్టివేసింది.
ఈ విషయంపై స్పందించిన అడ్వకేట్ సుధీర్ జ్యూడిషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జిల్లా కోర్టు కి వెళ్దాము అంటూ స్పష్టం చేశారు. కాగా సుశాంత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.