ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్​ టోర్నీని వచ్చే ఏడాది జూన్​ వరకు వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

 


కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆసియా కప్​ను వచ్చే ఏడాది జూన్​కు వాయిదా వేయాలని కార్యనిర్వహక బోర్డు నిర్ణయించింది" అని ఏసీసీ ట్వీట్​ చేసింది. ప్రణాళిక ప్రకారం ఈ టోర్నీ పాకిస్థాన్​లో నిర్వహించాల్సింది. కానీ, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్​ నిర్వహణకు మరో వేదికను ఎంచుకోవాలని ఏసీసీ నిర్ణయించింది. దీంతో ఆసియా కప్​-2021ని శ్రీలంకలో, 2022లో జరగాల్సిన ఆసియా కప్​ను పాకిస్థాన్​లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది ఆసియా క్రికెట్​ మండలి. ఈ ప్రకటనతో సెప్టెంబరులో ఐపీఎల్​ నిర్వహించడానికి బీసీసీఐకి మార్గం సుగమమైంది.

 

ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్​ రద్దయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం ఆసియా క్రికెట్​ మండలి నుంచి అందలేదని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు విచారం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: