మరోసారి  సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి దేవాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. సోమవారం వరకు ఉజ్జయిని అమ్మవారి దర్శనం లేదని భక్తులకు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించకుండా ఎక్కడ ఉన్నా ఇంకా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లాక్ డౌన్ తర్వాత భక్తుల భక్తితో కిటకిట లాడింది.

 

ఎంతో మంది భక్తులు తమ మొక్కులను చెల్లించడానికి ఒక్కసారిగా తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక మూలన తప్ప జరుగుతూనే ఉంటుంది.కరోనా మహమ్మారి దేవాలయాలను సైతం వదలడం లేదు. లాక్ డౌన్ సమయంలో పూర్తిగా దేవాలయాలు తెరవడానికి అనుమతి ఇవ్వలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: