ఉత్తర్ప్రదేశ్లో తొమ్మిదిమంది పోలీసుల మృతికి కారణమైన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యప్రదేశ్లో చిక్కిన వికాస్ దూబేను వెనక్కి తీసుకొస్తుండగా పోలీసులకు, దూబేకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందాడు దూబే.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పుర్ ఎన్కౌంటర్లో ప్రధాన సూత్రధారి అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రౌడీ షీటర్ వికాస్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నెల 3న అర్ధరాత్రి కాన్పుర్లో అతడిని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు బృందంపై వికాస్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులు అమరులయ్యారు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు వికాస్. అతని కోసం యూపీ పోలీసు బృందాలు విస్తృతంగా గాలించాయి. ఎట్టకేలకు నిన్న ఉదయం చిక్కాడు. ఈరోజు జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు.