విజయవాడలో ఒక దేవాలయం విషయంలో ఇటీవల జారీ అయిన ఉత్తర్వులపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మరోసారి విమర్శలు చేసారు. ఖరీదైన కోట్ల రూపాయల దేవుడి స్థలంపై విజయవాడ లో పెద్దల కన్ను పడిందని ఉమా ట్వీట్ చేసారు. 

 

తమ వారి పీఠానికి కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారని ఆయన ఆరోపించారు. "కీలక మంత్రి" చక్రం తిప్పడంతో చక చకా ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన ఆరోపించారు. శివయ్య స్థలం స్వాహా కాకుండా కాపాడేందుకు అధికారులు, మీ ప్రజా ప్రతినిధులు, మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి సిఎం వైఎస్ జగన్ గారూ అంటూ ఉమా ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: