ఈ నెల 15న ఏపీ కేబినేట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. కరోనా కట్టడి సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరగనుంది. చర్చించాల్సిన అంశాలపై ఈ నెల 13 సాయంత్రం 5 గంటల లోపు ప్రతిపాదనలు సిద్దం చెయ్యాలి అని సిఎస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

 

ఇక ఈ భేటీలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సహా ఆదాయ పెంపు మార్గాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ భేటీలోనే కొన్ని కీలక నిర్ణయాలను కూడా సిఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: