గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ వైద్యుడిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. “తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలందిస్తూ కరోనా బారినపడి "నా బిడ్డల కోసం బతకాలి. మెరుగైన చికిత్స అందించి బతికించండి" అని వేడుకున్న వైద్యుడి ప్రాణాలు కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయం. 

 

కరోనా నుంచి రికవరీలో  ఏపి అట్టడుగున ఉండటం చూస్తే బాధేస్తోంది. మరోవైపు ఫ్రంట్ లైన్ వారియర్ల పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆవేదన కలిగిస్తోంది. ఇవి చాలవన్నట్టు కరోనా కిట్ల స్కామ్, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలతో వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి కరోనాతో పోటీపడుతోంది కరోనా విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి. వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక భద్రతా పరికరాలు అందించాలి.”

మరింత సమాచారం తెలుసుకోండి: