కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామ్కుమార్ రామమూర్తి ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సంస్థలో 23 ఏళ్ల పాటు పనిచేశారు. ఇక కంపెనీలో 24 ఏళ్లు పనిచేసిన అనంతరం కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబరు 30న వైదొలగనున్నారు. ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో ఈ విషయాన్ని సంస్థ సీఈఓ బ్రయాన్ హంఫ్ర్రీస్ తెలిపారు. రామ్కుమార్ సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని కొనియాడారు.
ఇక ప్రదీప్ కుటుంబంతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారని, తదుపరి సవాల్కు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రదీప్ షిలిగే బాధ్యతలను ఆండీ స్టాఫోర్డ్ చేపట్టనున్నారు. కంపెనీ గ్లోబల్ డెలివరీ నెట్వర్క్ను నెలకొల్పడానికి దృష్టి పెట్టిందని అన్నారు.