సింగపూర్​ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ఘన విజయం సాధించింది. దేశంలోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని లీ షియాన్ లూంగ్ పార్టీ 83 సీట్లు గెలుచుకుంది. ప్రధాని లూంగ్ కూడా తన గ్రూప్ రిప్రెజెంటేషన్​ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొందారు.
భారత సంతతికి చెందిన ప్రీతమ్ సింగ్​ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ మిగిలిన పది స్థానాల్లో గెలుపొందింది. ఈ స్థానాల్లోనూ పీఏపీ గట్టి పోటీనిచ్చినా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.

 

పటిష్ఠ భద్రత నడుమ శుక్రవారం సింగపూర్​ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. కరోనా సంక్షోభం మొదలైన తరువాత ఓ ఆగ్నేయాసియా దేశంలో జాతీయ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో ఓటర్లు మాస్కులు, చేతి తొడుగులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ... ఓటింగ్​లో పాల్గొన్నారు. కరోనా రోగులకు, క్వారంటైన్​లో ఉన్నవారికి మాత్రం ఓటింగ్​కు అనుమతించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: