ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటీ అనే దానిపై చాలా సందేశాలు ఉన్నాయి. ఆ పార్టీ ఇప్పుడు ఏ విధంగా రాజకీయం  చేస్తుంది అనే దానిపై ఆ పార్టీ నేతల్లోనే చాలా సందేహాలు ఉన్నాయి అనే సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ పరిస్థితిపై విజయసాయి రెడ్డి తన మార్క్ లో పంచ్ వేసారు. 

 

చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడని ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: