కరోనా వైరస్ ని సమర్ధవంతంగా కట్టడి చేసిన రాష్ట్రాల్లో కేరళ చాలలా ముందు ఉంది. మొదటి సారి కరోనా ఆ రాష్ట్రంలోకి వచ్చినా సరే సిఎం నుంచి ప్రతీ ఒక్కరు కూడా సమర్ధవంతంగా వ్యవహరించిన నేపధ్యంలో కరోనా వైరస్ కి సంబంధించి చాలా వరకు అక్కడి ప్రభుత్వం విజయం సాధించింది. ఇప్పుడు ఇది పక్కన పెడితే... 

 

అక్కడ కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. నిన్న ఒక్క రోజే అక్కడ ఏకంగా 400 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా కట్టడిలో చాలా వరకు సమర్ధవంతంగా ఉన్నా సరే ఈ కేసులు ఈ విధంగా పెరగడంపై అక్కడి ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: