ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంచకుండా విపక్షం అడ్డుకోవడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో అధికార పక్షం విమర్శలు చేస్తుంది. అధికార పార్టీ నేతలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. 

 

లచ్చల్ లచ్చల్ ఇళ్లు తామే నిర్మించేశాం - పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఆయన ఎద్దేవా చేసారు. నీవు ఇళ్లు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబూ? అని ప్రశ్నించారు. లేని నగరాన్నే గ్రాఫిక్స్ లో సృష్టించి వాటాలు పంచినోడివి అంటూ విమర్శించారు.  బొంకరా బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారు చేశానన్నాడంట అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: