అమెరికాలో కరోనా దెబ్బ ఏ విధంగా ఉందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ దేశం వాళ్ళు కూడా ఆ దేశం వెళ్ళాలి అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం కరోనా వైరస్. కరోనా తీవ్రత పెరగడంతో ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు ఇప్పుడు అమెరికా బయట ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

 

తాజాగా కేరళ వచ్చిన ఒక అమెరికన్ తాను అమెరికా వెళ్ళేది లేదని చెప్తున్నాడు. తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని కోరుతూ 74 సంవత్సరాల వయసున్న అమెరికా జాతీయుడు జానీ పియర్స్ కోరుతున్నాడు. గత 5 నెలల నుండి అతను కొచ్చిలో ఉంటున్నాడు. కరోనా  వైరస్ కారణంగా యుఎస్ లో గందరగోళం ఉందని... భారత ప్రభుత్వం  తరహాలో అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నానని అతను పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: