కరోనా వైరస్ ని ముందు కట్టడి చేసిన రాష్ట్రంలో ఒడిశా ముందు ఉంటుంది. కాని ఇప్పుడు అక్కడ మాత్రం కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దాదాపు అక్కడ ప్రతీ రోజు 500 పైగా నమోదు అవుతున్నాయి. ఒడిశాలో గత 24 గంటల్లో 570 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
7972 మంది కరోనా బారిన పడి ఆ రాష్ట్రంలో కోలుకున్నారు. రాష్ట్రంలో 4,475 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం కేసులు 12,526 కు చేరుకున్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక ఆ రాష్ట్రంలో దాదాపుగా కీలక నగరాల్లో లాక్ డౌన్ ని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అమలు చేస్తుంది.